Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఏఎస్ రావునగర్ షోరూమ్లో శుక్రవారం ''ఆర్టిస్ట్రీ'' బ్రాండెడ్ జ్యువలరీ షో'' విశిష్ట ఆభరణాల ప్రదర్శనను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ మోడల్ ఎం. ప్రవళిక, స్కెచ్ ఆర్టిస్ట్ టి.శ్రీలేఖలు కలిసి వినియోగదారులు, శ్రేయోభిలాషులు, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. బంగారం, వజ్రాభరణాలు, జాతి రత్నాభరణాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని అన్నారు. ఈ ఆభరణాలు అద్వితీయమైన కళానైపుణ్యతతో అంతులేని హుందాతనంతో ఉన్నాయని తెలిపారు. నగిషీ చెక్కిన ప్రతి ఆభరణం తయారు చేసిన వారి అనుభవం ఇంకా కళాత్మకతకి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఆర్టిస్ట్రీ షోలో ప్రత్యేక ఆకర్షణలుగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్రాండ్స్ సమాహారం ''మైన్'' ధ్రువీకరించిన వజ్రాభరణాలు, వివాహ, పార్టీ సంబరాల కోసం, ''ఎరా'' అన్కట్ వజ్రాలతో పొదిగిన విశిష్ట శ్రేణి, ''ప్రెష్యా'' జాతి రత్నాభరణాల సముదాయం, ''ఎత్నిక్స్'' హస్తకళా నైపుణ్యతతో తయారైన ఆభరణాలు, జోల్ అధునాతన డిజైన్లతో తేలికపాటి ఆభరణాలు మగువల మనసులు దోచుకుంటాయన్నారు. డివైన్ భారతీయ ప్రాచీన సంప్రదాయం వ్యక్తం చేసే ఆభరణాలు ఇంకా చిన్నారుల కోసం ''స్టార్లెట్'' పిల్లల ఆభరణాలు సమకూర్చారని తెలిపారు. బ్రైడ్స్ ఆఫ్ ఇండియా క్యాంపెయిన్తో, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఒక ప్రముఖ వివాహాభరణాల సంస్థగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుందన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ క్యాంపెయిన్ లో మలబార్ షోరూముల్లో అందిస్తున్న వివాహాభరణాల శ్రేణిని ప్రదర్శిస్తుందన్నారు.ఈ సందర్భంగా ఏఎస్ రావు నగర్ స్టోర్ హెడ్ పికె. షిహాబ్ మాట్లాడుతూ.. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అతి వేగంగా పెరుగుతున్న నమ్మకమైన జ్యువలరీ బ్రాండ్ అని తెలిపారు. మలబార్ సంస్థ తన వార్షిక ఆదాయంలో సామాజిక సంస్థాగత బాధ్యత రూపంలో, సామాజిక సేవా దృక్పథంతో ప్రజలకు ఆరోగ్యం, ఉచిత విద్య, నిరుపేదలకు గృహ నిర్మాణం, మహిళా సాధికారిత, ఇంకా పర్యావరణ రక్షణ విభాగాలలో తమవంతు సాయం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సేల్స్ మేనేజర్ మనోజ్, స్టోర్ మేనేజర్ అక్షరు సేల్స్ మేనేజర్ గౌతమ్, భాస్కర్, మార్కెటింగ్ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.