Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
కూరగాయల సరఫరా పేరుతో విశాఖప్నటం నుంచి మహారాష్ట్రలోని అహ్మద్నగర్కు హైదరాబాద్ మీదుగా గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఇద్దరు నిందితులను ఈస్ట్జోన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 300 కిలోల గంజాయి, డీసీఎం టాటా గూడ్స్ వాహనంతోపాటు రెండు సెల్పోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.30 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. శనివారం నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన విలాస్ భౌమాహెబ్ ధోకనే, జ్ఞానేశ్వర్ మోహతే గంజాయి స్మగ్లర్లు. సులువుగా డబ్బులు సంపాదించాలని గంజాయిని నర్సిపట్నం నుంచి అహ్మద్నగర్కు స్మగ్లింగ్ చేస్తున్నారు. ప్రతి ట్రిప్లో 200 కిలోల నుంచి 400 కిలోల గంజాయిని డీసీఎంలో తీసుకెళ్తున్నారు. ఈ సారీ 300ల కిలోల గంజాయిని 10 బ్యాగుల్లో ప్యాక్ చేసి, నర్సీపట్నం నుంచి సూర్యాపేట్, హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్సు, ఈస్ట్జోన్ పోలీసులు ముసారాంబాగ్లో నిందితులను అరెస్టు చేశారు. నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా డీసీఎంలో కూరగాయల ఖాళీ ట్రేల మధ్యలో గంజాయి బ్యాగ్లను పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తున్నారు. చెక్పోస్టుల వద్ద ప్రశ్నించిన సమయంలో కూరగాయలను అన్లోడ్ చేసి వస్తున్నామని నమ్మిస్తున్నారన్నారు. గంజాయి స్మగ్లింగ్లో కొంత మంది డ్రైవర్లు, రైతులు, స్మగ్లర్లు, కొనుగోలు దారులు, ట్రాన్స్పోర్టుతోపాటు రిటైలర్ల ప్రమేయముందని సీపీ తెలిపారు. విచారణలో మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశముందన్నారు. ఈ సమావేశంలో ఈస్ట్జోన్ జాయింట్ సీపీ రమేష్రెడ్డి, డీసీపీ రాధాకిషన్ రావు, ఏసీపీ ఎన్.వెంకటరమణ, ఇన్స్పెక్టర్లు కె.శ్రీనివాస్, కె.నాగేశ్వర్రావు, ఎస్ఐలు కె.శ్రీకాంత్, బి.అశోక్రెడ్డి, జి.శివానందంతోపాటు తదితరులు పాల్గొన్నారు.