Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
టీఆర్ఎస్ మల్కాజిగిరి నియోజకవర్గ అధికార ప్రతినిధిగా జీఎన్వి సతీష్కుమార్ను మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సతీష్కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మల్కాజిగిరి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.