Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
పేదలకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉందని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల రాయుయాదవ్ అన్నారు. గౌతమ్నగర్ డివిజన్ పరిధిలోని దయానంద్ నగర్కు చెందిన టీఆర్ఎస్ నాయకులు జాన్ తండ్రి ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న పార్టీ సీనియర్ నాయకులు మేకల రాములుయాదవ్ మానవతా దృక్పథంతో రూ.10 వేలు ఆర్థిక సాయంగా డివిజన్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల చేతుల మీదుగా కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా రాముయాదవ్ మాట్లాడుతూ మానవతా దృక్ఫథంతో ప్రతి ఒక్కరూ పేదలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ, తమకు తోచిన రీతిలో ప్రతి ఒక్కరూ వివిధ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులో ఉన్న పేదవారికి సహాయపడాలని కోరారు.