Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
టైప్ రైటింగ్ ఎక్సమ్ ఫీజ్ను తగ్గించేందుకు, సీబీటీ టెస్టు గుర్తింపు పొందిన టైప్ ఇనిస్టిట్యూట్ వారికే ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని టైప్ రైటింగ్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార ్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి హామీనిచ్చారు. తెలంగాణ రాష్ట్ర టైప్ రైటింగ్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం ఆదివారం బోయిన్పల్లిలోని రాజశేఖర్రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టైప్ రైటింగ్ ఇనిస ి్టట్యూట్ అసోసియేషన్ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే అసోసియేషన్ రాష్ట్ర కమిటీని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దగ్గరకు తీసుకెళ్తామని చెప్పారు. భవిష్యత్లో ఎలాంటి అవసరాలు ఉన్నా టీఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియే షన్ అధ్యక్షులు బండి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సతీష్బాబు, రాజేశ్వర్, మల్లికార్జున్, తిరుపతి, రామేశ్వరాచారి, సీతారాం, సురేందర్, తదితరులు పలు సమస్యలను మర్రి రాజశేఖర్రెడ్డికి చెప్పారు. ఇందుకు సంబంధించిన ఒక వినతి పత్రాన్ని కూడా రాజశేఖర్ రెడ్డికి అందజేశారు.