Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
వరద ముంపు ప్రాంతాల ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజరు కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్, న్యూ పటేల్ నగర్, చిలకమ్మ గల్లీ, బాపు నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. వర్షం కారణంగా ఇండ్లలోకి నీరు వచ్చి పూర్తిగా నిత్యావసర సరుకులు తడిసిముద్దయ్యాయని. షార్ట్ సర్క్యూట్తో కొన్ని ఇళ్లలో అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు అన్ని విధాలుగా ఆర్థిక సాయం అందేవరకు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్లేష్ యాదవ్, మహేష్ ముదిరాజ్, వంజరి నాగరాజ్, రంగు ఉదరు గౌడ్, తిరుపతి, నాగరాజు, సంతోష్ చారి పాల్గొన్నారు.