Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
వివాహేతర సంబంధం అనే అనుమానం ఓ మహిళ ప్రాణాలను బలి తీసుకున్న సంఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కాకినాడకు చెందిన జ్యోతి, విజరు భార్యాభర్తలు. జీవనోపాధి కోసం నగరానికి వచ్చి మలక్పేటలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజరు యశోద హాస్పిటల్లో అంబులెన్స్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తుండగా జ్యోతి (35) సెంట్రల్ మాల్లో పనిచేస్తుంది. అయితే జ్యోతికి గత కొంతకాలం కిందట రాజు అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈనేపథ్యంలో ప్రతాప్నగర్లోని రాజు నివాసానికి వెళ్లిన జ్యోతి శనివారం రాత్రి గదిలో ఉరి బిగించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులను తొలగించి క్లూస్ టీం సహకారంతో ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.