Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కాలనీలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని మాజీ కార్పొరేటర్ జి.సురేష్రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్నగర్ ఫేస్ 1లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంబీపూర్రాజుల సహకారంతో పరిష్కరించేలా కృషి చేస్తానన్నారు. కాలనీలో వీధి దీపాలను, సీసీ రోడ్లు, డ్రెయినేజీ లైన్లను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటానన్నారు. జనవాసాల మధ్య ఉన్న కంపెనీలను తొలగించేలా చర్యలు తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు బి.కృష్ణ, శ్రీనివాస్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.