Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్పేట
శామీర్పేట గ్రామ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 1998-99 విద్యాసంవత్సరం పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు యాష్కీ కష్ణబాబు, రాయి ప్రభాకర్ ఇటీవల అకాల మరణం చెందడంతో వారి కుటుం బాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. విషయం తెలుసుకున్న సహాధ్యాయులు తలా కొంత డబ్బులు జమ చేసి ఆదివారం శామీర్పేటలో మరణించిన తమ మిత్రుల ఇంటికి తరలివెళ్లి కష్ణబాబు కుటుంబానికి రూ.50వేల నగదు, రాయి ప్రభాకర్ కుటుంబానికి ఆయన బిడ్డ పేరుమీద పది వేలు, మరో 50 వేల రూపాయలు పెళ్లీడు వచ్చే వరకు బ్యాంకులో ఫిక్స్డు డిపాజిట్ చేసి మొత్తం లక్ష పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో శామీర్పేట మాజీ సర్పంచ్ బత్తుల కిషోర్ యాదవ్, బాబాగుడా ఉపసర్పంచ్ భాస్కర్రెడ్డి, రాము, ఆంజనేయులు, నరేష్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.