Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
'ఒక పరికొక పరి వయ్యారంగా' అన్నమయ్య కీర్తన హైమవతి అభినయంలో హోయలు వొలికిస్తూ నర్తించి ప్రేక్షకులను ముగ్దుల చేశారు. శ్రీత్యాగరాయ గాన సభలో ఆదివారం నృత్య కిన్నెర సంస్థ నిర్వహణలో ప్రముఖ నాట్య గురువు డాక్టర్ శోభానాయుడును సంస్మరిస్తూ ఆమె శిష్యురాలు హైమవతి 'స్వాగతం కృష్ణ', 'మామవతు సరస్వతి' అంశాలను హృద్యంగా నర్తించారు. ముఖ్య అతిథిగా తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత ఉప కులపతి ఆచార్య ఎన్. గోపి మాట్లాడుతూ పురాణ, ప్రబంధ కథలోని కథానాయిక పాత్రలను తన నర్తనంలో ఆవిష్కరించిన మహా నాట్య కళాకారిణి శోభా నాయుడు అన్నారు. నాట్యమే శ్వాసగా జీవించిన శోభా నాయుడు లేని లోటు ఆమె తీర్చిద్దిన హైమవతి వంటి కళాకారులు భర్తీ చేయాలన్నారు. ప్రముఖ నాట్య గురువు డాక్టర్ జొన్నలగడ్డ అనురాధ మాట్లాడుతూ శోభ నాయుడు అంకిత భావం, దీక్ష నేటి కళాకారులకు స్ఫూర్తి కావాలన్నారు. సాహితీవేత్త డాక్టర్ వోలెటి పార్వతీశం అధ్యక్షత వహించిన సభలో నిమ్స్ విశ్రాంత అధికారి రాజ కుమార్ పాల్గొనగా సంస్థ నిర్వహకురాలు డాక్టర్ ఉషా గాయత్రి స్వాగతం పలికారు.
'అను