Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఉత్సవాలలో భాగంగా లీడ్ ఇండియా ప్రోగ్రెసివ్ స్కూల్, కాలేజ్ ఫెడరేషన్ల ఆధ్వర్యంలో లీడ్ ఇండియా ఫౌండేషన్ నేతృత్వంలో కలామ్స్ మెషిన్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు 2021కి గాను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రంగారెడ్డినగర్ డివిజన్ ఆదర్శనగర్ ప్రాంతానికి చెందిన నవజ్యోతి హై స్కూల్ చైర్మన్ మలిరెడ్డి ఇందిరా రవీందర్రెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం నగరంలోని రవీంద్ర భారతీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డును కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు ప్రముఖులతో ప్రధానం చేయనున్నట్లు పాఠశాల యజమాన్యం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం ఐడీపీఎల్లోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి పాఠశాల వరకు ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.