Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పి. జగన్
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
విద్యా విధానం, విద్యార్థుల సమస్యలపై ఐదు దశాబ్దాలుగా భారత విద్యార్థి పెడరేషన్ (ఎస్ ఎఫ్ఐ) అలుపెరుగని పోరాటాలు నిర్వహించిందని ఎస్ఎప్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పి. జగన్ అన్నారు. ఆదివారం అబ్దుల్లాపూర్ మెట్ మండలం కేంద్రంలో ఎస్ఎఫ్ఐ రెండతో మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పి జగన్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం మూడు ఆశయాల కోసం పనిచేస్తుందని అన్నారు. ఎస్ఎఫ్ఐ ఆవిర్భవించిన అనంతరం విద్యార్థుల సమస్యలపై అనేక ఉద్యమాలు చేపట్టిందన్నారు. అనంతరం17 మందితో మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఎస్ ఎఫ్ఐ మండల నూతన అధ్యక్ష, కార్యదర్శిలుగా లోకేష్, శివకుమార్, ఉపాధ్యక్షులుగా వంశీ, నవీన్, భార్గవి, సహాయకార్యదర్శిలు సిద్దు, శ్రీహరి, కిషన్, సభ్యులుగా అక్షర, ప్రణరు, శివ లింగం, అజరు, మహేష్, శివ, వేణు, సాయి, ప్రవీణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.