Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్తో చర్చించి రాష్ట్రంలోని 33 జిల్లాల టీఎన్జీవో అధ్యక్ష, కార్యదర్శులతో 'అలరు బలరు' కార్యక్రమం నిర్వహించనున్నట్టు హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్.ఎం.హుస్సేని(ముజీబ్) అన్నారు. దసరా పండుగను పురస్కరించుకుని అదివారం జిల్లా కార్యదర్శి విక్రమ్ కుమార్, ఉపాధ్యక్షులు కె.ఆర్. రాజ్కుమార్, ప్రచార కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్, సభ్యులు వైదిక్ శాస్త్ర, శంకర్ ఆయన స్వగృహాంలో మర్యాదపూర్వకంగా కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముజీబ్ మాట్లాడుతూ తెలంగాణలో అతిపెద్ద పండుగైన దసరాను ఉద్యోగులు, తెలంగాణ ప్రజలు ఆనందోత్సవాలతో జరుపుకోవడం హార్షనీయమన్నారు. దసరా పండుగ అంటేనే ప్రజలు ప్రకృతితో మమైకమై చేసుకునే పండుగ అని, ప్రజల ఐక్యత స్ఫూర్తికి నిదర్శమని చెప్పారు.