Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
రానున్న రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురువనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియజే స్తున్నందున నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండా లని రాష్ట్ర ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆదివారంఒక ప్రకటనలో కోరారు. ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు వంకలు వరదనీటిలో దాటుతున్న క్రమంలో యువతీ యువకులు గల్లంతై చనిపోయారని విచారం వ్యక్తం చేశారు. అలాంటి సంఘటనలు పునరావతం కాకుండా అధికారులు ప్రజాప్రతినిధులు తక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రాత్రి వేళల్లో ప్రయాణాలు రద్దు చేసుకోవాలని కోరారు.