Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-కేతెపల్లి
పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసి అమరులైన వారి ఆశయాలు ఎప్పటికీ చిరస్మరణీయమని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మండలంంలోని చీకటిగూడెం గ్రామానికి చెందిన ఆ పార్టీ సీనియర్ నాయకులు కోట మీనయ్య వయస్సు ఈనెల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మతి చెందాడు. . మీనయ్య అంతిమయాత్ర ఆదివారం నిర్వహించారు. ఆయన భౌతిక కాయానికి జూలకంటి రంగారెడ్డి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీనయ్య మతి పార్టీకి తీరని లోటని చెప్పారు. నివాళులర్పించిన వారిలో ఆ పార్టీ జిల్లా కమిటీ కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి , జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందాల ప్రమీల, జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చిన్న వెంకులు , సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ బోళ్ల వెంకట్ నరసింహారెడ్డి , మండల కార్యదర్శి చింతపల్లి మారయ్య , నాయకులు ఎల్ అశోక్ రెడ్డి కోట లింగయ్య గ్రామ శాఖ కార్యదర్శి సాదె నాగయ్య నాయకులు చెవుగోని నాగయ్య జి శ్రీను వీరబోయిన చౌడయ్య కర్ర బాలయ్య వీర బోయిన వెంకన్న మాజీ జెడ్పీటీసీ సభ్యులు కోట మల్లికార్జున రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు కోట పుల్లయ్య వివిధ పార్టీల నాయకులు ఉన్నారు.