Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
నవ సమాజానికి దిక్సూచి ఉపాధ్యాయులేనని, సమాజంలో గురువు పాత్ర ఎంతో కీలకమని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. కీ.శే. ఏపిజే అబ్దుల్ కలాం జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని లీడ్ ఇండియా ప్రోగ్రెసివ్ స్కూల్స్, కళాశాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో లీడ్ ఇండియా ఫౌండేషన్ నేతృత్వంలో కలామ్స్ మిషన్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2021 పురస్కారాలు నగరంలోని రవీంద్ర భారతీలో నిర్వహించారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రంగారెడ్డినగర్ డివిజన్కు చెందిన నవజ్యోతి హైస్కూల్ కరస్పాండెంట్ చైర్మెన్ మలిరెడ్డి ఇందిరా రవీందర్రెడ్డి ఎంపికయ్యారు. సోమవారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ , లీడ్ ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు ప్రముఖ బ్యాడ్మింట్ డాక్టర్ పుల్లెల గోపిచంద్, కమిటీ అధ్యక్షులు ఎస్ఎన్రెడ్డి, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞశర్మ, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు కందాల పాపిరెడ్డితో పాటు ఇతర ప్రముఖుల చేతుల మీదుగా ఆమెకు జ్ఞాపికను ప్రధానం చేశారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు గ్రహీత మలిరెడ్డి ఇందిరా రవీందర్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం ఐడీపీఎల్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఆదర్శనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చింతల్ డివిజన్ పట్వారీ నగర్లోని నవజ్యోతి హై స్కూల్ బ్రాంచ్లో ఉపాధ్యాయులు, యజమాన్యం సన్మాన సభ నిర్వహించారు. ఆదర్శనగర్, పట్వారీ నగర్ సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు పుష్పగుచ్చాలతో ఆమెను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఎం.రవీందర్రెడ్డి, అధ్యాపక బృందం మారుతి, రామ్రెడ్డి పాల్గొన్నారు.