Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కేపీహెచ్బీ
పైపులలో పేరుకుపోయిన మట్టిని తొలగించి పనులను పునర్ ప్రారంభించాలని అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసోద్దిన్ అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని కేఎస్ నగర్, ఆర్కే సొసైటీ, కేజీఎన్నగర్, శివాజీనగర్, జ్యోతినగర్లలో నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రయినేజీ పనులను ఆమెతో పాటు మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్, డీఈ ఆనంద్లతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన వర్షాలకు పైపులైన్లో మట్టి చేరుకోవడంతో వర్షపు నీరు పోయేందుకు ఇబ్బందిగా మారిందన్నారు. మ్యాన్హోల్స్కు అడ్డంగా ఉన్న తాగునీటి పైపులైన్లోకి మురుగునీరు చేరి, నీటి కాలుష్యం ఏర్పడకుండా పైపును దారి మళ్లించాలన్నారు. కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ వినాయక్రావు, నాయకులు సుభాన్, సలీమ్, చాంద్భాయి,రజాక్, నర్సింహా, ఇస్మాయిల్, శివ, బాలయ్య, సత్యనారాయణ, ఇందిరా, రెజీనా, మాధవచారి, జలీల్, అయూబ్, మైను పటేల్ తదితరులు పాల్గొన్నారు.