Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్
నవతెలంగాణ-ధూల్పేట్
సాలార్జంగ్ మ్యూజియంలోని గ్యాలరీల కళాఖండాల విశిష్టత, చరిత్రలను సందర్శకులు గైడ్ యాప్తో సులభంగా తిలకించవచ్చు అని ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం పిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ అన్నారు. సోమవారం సాలార్జంగ్మ్యూజియంలో నిజాం కుటుంబ సభ్యులు, కేర్ టేకర్ రోనక్లతో కలిసి గైడ్ యాప్ను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడియో యాప్ ద్వారా సందర్శకులు గైడ్ సలహా లేకుండానే మ్యూజియం సందర్శిస్తూ కళాఖండాల, చారిత్రక తను విశేషాలను తెలుసుకోవచ్చన్నారు. నిజాం సాంప్రదాయ వస్త్రధారణ, సూక్ష్మ చిత్రాల నుంచి శిల్పాలు, తివాచీలు బొమ్మలు, ఫర్నిచర్, గడియారాల వరకు 46వేల వస్తువుల సేకరణ చేసి ఏర్పాటు చేశామన్నారు. ఈసేకరణ ప్రముఖ సాలార్ జంగ్ కుటుంబం నుంచి తీసుకొని హాస్అన్ ఇండియా సంస్థ ద్వారా ఆధారితం చేయబడి ఉందన్నారు. సాలార్ జంగ్ మ్యూజియం కోసం ఆడియో గైడ్ యాప్తో కళాకతుల వెనుక కథలు, అద్భుతమైన ముఖ చిత్రాల వెనుక ఉన్న అద్భుతమైన చరిత్ర ఉంటుందని మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ నాగేందర్ తెలిపారు.. సందర్శకులు ప్రవేశానికి ముందే ఫోన్ సందర్శన టికెట్టు తీసుకోవాలని, హాల్ టికెట్ వెనుకభాగంలోని యాప్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. 39 గ్యాలరీలు, 77 పాయింట్స్ యాప్లో ఉంటాయన్నారు. ప్రతి గ్యాలరీ వద్ద స్కాన్ చేసి వాటి ప్రత్యేకతను ఆడియో ద్వారా తెలుసుకోవచ్చు అని, త్వరలో వీడియో యాప్ కూడా రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మ్యూజియం కీపర్ డాక్టర్ కుసుం, డిప్యూటీ కీపర్స్ కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.