Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ సినీ
నిర్మాత దిల్రాజు
మిరాకిల్ చైల్డ్ కేర్ ప్రారంభం
నవతెలంగాణ-బోడుప్పల్
వైద్యులు ఎల్లప్పుడూ సేవా దృక్పథంతో ఆలోచించి వైద్యం అందించాలని, అలాంటప్పుడే సమాజంలో మంచి పేరు వస్తుందని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. సోమవారం మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని శ్రీకర హాస్పిటల్లో మిరాకిల్ చైల్డ్ కేర్ను (చిన్న పిల్లల ప్రత్యేక విభాగం) ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా దిల్రాజు మాట్లాడుతూ నేడు సమాజానికి దైర్యం చెప్పి అండగా ఉంటుంది కేవలం వైద్యులేనని అన్నారు. లాభాపేక్షతో కాకుండా సామాజిక బాధ్యతతో వైద్యులు ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఏసీపీ ఎన్.శ్యాం ప్రసాద్ రావు, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కుర్రి శివకుమార్ గౌడ్, మేడిపల్లి సీఐ బీ.అంజిరెడ్డి, కార్పొరేటర్లు దొంతిరి హరిశంకర్ రెడ్డి, ఎంపల్ల అనంత్ రెడ్డి, హాస్పిటల్ చైర్మెన్ డాక్టర్ అఖిల్ దాడి, డాక్టర్లు సుహాస్, బి. వివేక్, సాత్విక్, రమా సరస్వతి, టీఆర్ఎస్ నాయకులు పప్పుల అంజిరెడ్డి, యాసారం మహేష్ పాల్గొన్నారు.