Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్బజార్
ఈనెల 24న బోయిన్పల్లి జీవీఆర్ గార్డెన్లో జరగనున్న మాదిగ ఉద్యోగుల సమాఖ్య 5వ జాతీయ మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ గోషామహల్ నియోజకవర్గ ఇన్చార్జ్ పూజలొల్ల రవి మాదిగ పిలుపునిచ్చారు. ఈమేరకు సోమవారం మహాసభ కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, కొండూరు రాజఎల్లయ్య మాదిగ, ఉపకులాల జాతీయ నాయకులు కడమంచి ముత్తయ్య బుడగజంగం, హైదరాబాద్ జిల్లా కో ఇన్చార్జ్ మునిరాతి అరుణ్ కుమార్ మాదిగ, సీనియర్ నాయకులు ఉప్పరపల్లి బాలసాయిలు మాదిగ, యువసేన నాయకులు అడ్డకుల లక్ష్మణ్ మాదిగ, ఎంఎంఎస్ నాయకురాలు ఆకారం రాధిక మాదిగ, దివ్య మాదిగ, పార్నంది అశోక్ మాదిగ, మునిరాతి రామకృష్ణ మాదిగ, సాయి మాదిగ, చందు మాదిగ తదితరులు పాల్గొన్నారు.