Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేటీఆర్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.ఏ.ముజీబ్
నవతెలంగాణ-బోడుప్పల్
కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తాయని కేటీఆర్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.ఏ.ముజీబ్ అన్నారు. సోమవారం ఆయన మేడిపల్లిలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయ భిక్ష పెట్టిన పార్టీకి పంగానామలు పెట్టాలని చూసిన ఈటల రాజేందర్ నేడు నోటికి ఏదోస్తే అదే మాట్లాడుతూ తన స్థాయిని దిగజార్చుకుంటున్నారని ఆరోపించారు. గెలుపుపై ఆశలు లేక కేవలం వాట్సప్ యూనివర్సిటీ నుంచి అబద్దాలు ప్రచారం చేసి కేసీఆర్ సర్కారుపై దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా ప్రచారం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. నిత్యం పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలపై బీజేపీ నాయకులు ఎందుకు సమాధానం చెప్పడం లేదో వివరించాలని కోరారు. బీజేపీ నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపును అడ్డుకోలేరని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని, సంక్షేమ సర్కారుకే ఓటు వేయాలని కోరారు.