Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
రాష్ట్రంలో చిన్న, సన్నకారు దళిత మహిళా రైతులను సంఘటితం చేసి వారి సమస్యల పరిష్కారానికి పీపుల్ మానిటరింగ్ కమిటీ కృషి చేస్తుందని ఆ సంఘం జాతీయ కన్వీనర్ బోస్ తెలిపారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పీపుల్స్ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి వ్యవసాయ నెట్వర్క్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా బోస్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో చిన్న, సన్నకారు రైతులకు సంబంధించిన పూర్తి వివరాల ఆధారంగా రైతుల లబ్ధి కోసం కృషి చేయాలన్నారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ప్రతి జిల్లాకు ఐదు మండలాల్లో ఐదు సంవత్సరాలు రైతుల కోసం అంకితభావంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ శివలింగం, రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు ప్రసాద్, వివిధ జిల్లాలకు సంబంధించిన ప్రతినిధులు రాజలింగం, రమేష్, తిరుమలేష్, మౌలానా, కృష్ణవేణి, నాగయ్య, రామ్మూర్తి, ఉమా తదితరులు పాల్గొన్నారు.