Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కరింగుడా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దాతలు సహకరించడం అభినందనీయమని సర్పంచ్ కౌకుంట్ల గోపాల్రెడ్డి అన్నారు. పాఠశాల విద్యార్థులకు బెల్టులు, టైలు, బ్యాడ్జ్లను రాంపల్లి దాయరకు చెందిన వార్డు సభ్యులు కందాడి శ్రీకాంత్రెడ్డి ఉచితంగా అందజేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తమవంతుగా సాయం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పరమేష్గౌడ్, గ్రామ పెద్దలు సింగిరెడ్డి రాంరెడ్డి, పాఠశాల ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ బొల్లి మహేష్గౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.