Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రజలు శాంతియుతంగా పండుగలను జరుపుకో వాలని కీసర సీఐ నరేందర్ గౌడ్ అన్నారు. సోమవారం కీసర పోలీస్ స్టేషన్లో మైనారిటీ నేతలతో సమావేశం నిర్వ హించారు. మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రశాంతంగా పండుగ వేడుకలు నిర్వహించుకోవాలని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలన్నారు. ప్రార్థనా మందిరాల వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా చూడా ల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. కీసర పోలీసు లకు ముస్లిం సోదరులు సహకరించాలని కోరారు. కార్యక్ర మంలో అడిషనల్ ఇన్స్పెక్టర్ భబ్యానాయక్, ఎస్ఐ రామ సూర్యం, నాగారం మున్సిపల్ కో-ఆప్షన్ నెంబర్ ఆదామ్ షఫిక్, మైనారిటీ అధ్యక్షుడు గౌస్, అక్బర్ పాల్గొన్నారు.