Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ
నవతెలంగాణ-అడిక్మెట్
కేంద్ర ప్రభుత్వం ఉన్నత ఉద్యోగాల్లో బడుగులకు తీవ్ర అన్యాయం చేస్తుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ఆరోపించారు. ఈమేరకు మంగళవారం విద్యా నగర్ బీసీ భవన్లో నిర్వహించిన బీసీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ కులగణనకు టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మద్దతు పలకడం హర్షించదగ్గ విషయమన్నారు. సెప్టెంబర్ మూడో వారంలో విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ వర్గాల అభ్యర్థుల ఇంటర్వ్యూలో ఘోర అన్యాయం చేశారని తెలిపారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగా పట్టించుకోకపోవడం వల్ల ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఇతర ఉన్నత ఉద్యోగాలు బడుగులకు దూరం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తక్షణమే ఇంటర్వ్యూ చేసి వారిలో 80శాతం ఉన్నతఉద్యోగాలు బడుగు బలహీన వర్గాలకు అందేటట్లు చూడాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పి సుధాకర్ ముదిరాజ్, ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.