Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
ప్రజా సేవకే తన జీవితం అంకితమని కాంగ్రెస్ మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కో ఆర్డినేటర్ తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. మంగళవారం తన జన్మదిన వేడుకలను అభిమానులు, కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 30 ఏండ్లుగా సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్నానని, గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజలతో కలిసి ఉండడం తనకు అత్యంత సంతోషాన్ని ఇచ్చే అంశమని అన్నారు. బోడుప్పల్ అనే గ్రామంలో సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించిన తాను ఈ రోజు రాష్ట్రస్థాయిలో అందరూ గుర్తించేలా ఎదగడానికి మేడ్చల్ నియోజకవర్గం ప్రజల కృషి మరువలేనిదని అన్నారు. కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, 17వ డివిజన్ కార్పొరేటర్ పోగుల నరసింహ రెడ్డి, కార్పొరేటర్లు తోటకూర అజరు యాదవ్, బొమ్మకు కల్యాణ్, నాయకులు కత్తి వెంకట్ రెడ్డి, చెంగిచెర్ల మాజీ వార్డ్ సభ్యులు కుర్ర శివశంకర్, గందే విశ్వం, తోటకూర మల్లేష్ యాదవ్, ఫకీర్ హరినాథ్ రెడ్డి, మహిళ కాంగ్రెస్ నాయకురాలు మచ్చ వరలక్ష్మి, యూత్ కాంగ్రెస్ నాయకులు కొత్త సుశాంత్ గౌడ్, అసర్ల బీరప్ప, తోటకూర రాహుల్ యాదవ్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, లీగల్ సెల్ జిల్లా చైర్మెన్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పన్నాల శ్రీనివాస్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ రెడ్డి, జంగాచారీ, మహిళ అధ్యక్షురాలు శ్రీలత భద్రు నాయక్, ఉపాధ్యక్షుడు ఎర్ర ఐలేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.