Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే వెంకటేష్
నవతెలంగాణ-అంబర్పేట
అభివృద్ధిలో కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షుల పాత్ర కీలకం అని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ఈమేరకు మంగళవారం అంబర్పేట నియోజకవర్గం కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పెండింగ్, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు చర్చించి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ని కలవాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, విజరు కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు డాక్టర్ ఓం ప్రకాష్ యాదవ్, డాక్టర్ శిరీష యాదవ్, డివిజన్ అధ్యక్షులు సిద్ధార్థ్ ముదిరాజ్, చంద్రమోహన్, మేడి ప్రసాద్, భీష్మ తదితరులు పాల్గొన్నారు.