Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ధ్వని కాలుష్య నివారణకు అందరూ భాగస్వాములు కావాలని నగర సీపీ అంజనీకుమార్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ ప్రధాన గేటు వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వెయ్యి ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను రోడ్డు రోలర్తో ధ్వంసం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగర ఇమేజ్ ఏ మాత్రం తగ్గకుండా అందరం కలిసికట్టుగా ధ్వని కాలుష్యాన్ని నివారించడానికి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎక్కువ శబ్దాలతో వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈఏడాది ఇప్పటి వరకు 12, 938 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. సైలెన్సర్లు అమ్మే వ్యాపారులకు సైతం పోలీసులు అవగాహన కల్పించినట్లు తెలిపారు. అతిగా శబ్దం చేసే సైలెన్సర్లతో వాహనదారులు పట్టుబడితే తొలిసారి రూ.వెయ్యి, రెండోసారి పట్టుబడితే రూ.2వేలు జరిమానా విధించనున్నట్లు చెప్పారు. వరుసగా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ధ్వని కాలుష్యం చేస్తూ రోడ్లపై యువకులు బైక్ రేసింగ్ పాల్పడుతున్నారని, రోడ్లపై వెళ్లే వారికి సౌండ్ పొల్యూషన్తో అనారోగ్యానికి గురవడంతో పాటు గుండెపోటు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ అడిషనల్ సీపీ ఎస్ఏ చౌహాన్, ట్రాఫిక్ ఏసీపీ గజానంద్ రెడ్డి, బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ రెడ్డి, ఏసీపీ ఎం సుదర్శన్, ట్రాఫిక్ ఎస్ఐలు వీరబాబు, వెంకన్న పాల్గొన్నారు.