Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్మెట్ డివిజన్లోని వడ్డెర బస్తీ కమ్యూనిటీ హాల్ని పరిరక్షించాలని వడ్డెర సంఘం గ్రేటర్ హైదరాబాద్ యువజన అధ్యక్షులు దండుగుల రమేష్ డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం కమిటీ హాల్ ఎదురుగా బస్తీవాసులతో కలిసి భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ ఏదైనా శుభకార్యం చేసుకోవడానికి ఐకమత్యంగా ఉండి సాధించుకున్న వడ్డెర బస్తీ కమ్యూనిటీ హాల్ను కొన్ని రాజకీయ శక్తులు ఆటంకాలు సృష్టించి కబ్జా చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. కమ్యూనిటీ హాల్ పార్కింగ్ పరిసర ప్రాంతాల్లో నివాస స్థలాలు ఏర్పాటుచేసి శుభకార్యాలు చేసుకునేవారిని ఇబ్బందులకు గురిచేయాలని కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించుకున్న కమ్యూనిటీ హాల్ పార్కింగ్ స్థలంలో ఎటువంటి కట్టడాలు నిర్మించిన తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. కమ్యూనిటీ హాల్ను పరిరక్షించుకునే బాధ్యత బస్తీవాసులపై ఉందని అన్నారు. ధర్నాలో బస్తీ అధ్యక్షుడు కుంచపు శ్రీన, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, సలహాదారులు పల్లపు సత్యనారాయణ, శంకర్, ఉపాధ్యక్షులు వల్లబ్ కృష్ణ, వల్లపు సుదర్శన్, జయ, భాగ్య, సునీత, వెంకటమ్మ పాల్గొన్నారు.