Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని వార్డ్ ఆఫీసులో జీహెచ్ఎంసీ సూపర్వైజర్, శానిటేషన్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల్లో ఎక్కడి చెత్త అక్కడే ఉంటుందని, మరికొన్ని ప్రాంతాల్లో దోమల బెడద ఉన్నందున ఎప్పటికప్పుడు దోమల మందు స్ప్రే చేయించాలని అధికారులకు సూచించారు.