Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోషామహల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రేమ్ సింగ్ రాథోడ్
నవతెలంగాణ-ధూల్పేట్
అన్ని డివిజన్ నుంచి భారీఎత్తున నాయకులు, కార్యకర్తలతో తరలివెళ్లి టీఆర్ఎస్ ప్లీనరీని విజయవంతం చేస్తామని గోషామాల్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి ప్రేమ్ సింగ్ రాథోడ్ అన్నారు. మంగళవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన పార్టీ సమావేశంలో సెక్రటరీ జనరల్ కేశవ రావు, హోం మంత్రి మహమూద్ అలీ, ప్రధాన కార్యదర్శి బండి రమేష్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాటు అన్ని నియోజకవర్గాల ఇన్చార్జ్లు, డివిజన్ ఇన్చార్జ్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 25న జరగబోయే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం కోసం నియోజకవర్గంలోని గోషామహల్, గన్ ఫౌండ్రీ, బేగంబజార్, దత్తాత్రేయ నగర్, జాంబాగ్, మంగళ్హాట్ డివిజన్ల మాజీ కార్పొరేటర్లు డివిజన్ ఇన్చార్జిలు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో కేటీఆర్ ఇచ్చిన సూచనలను ప్రభుత్వ ఆదేశానుసారంగా ఏకం కావాలన్నారు. గోషామహల్ నియోజకవర్గం మాజీ కార్పొరేటర్లు, పోటీపడిన కార్పొరేటర్లు కొత్తగా ఎన్నికైన గోషామహల్ నియోజకవర్గం 6 డివిజన్ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, సన్నాహక సమావేశం, టీఆర్ఎస్ విజయ గర్జన సమావేశం సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో మంగళ్హాట్ మాజీ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్ లోధ్, డివిజన్ ప్రెసిడెంట్ శశిరాజ్ సింగ్, ఆరు డివిజన్లో నాయకుల్ను తదితరులు పాల్గొన్నారు.