Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
కూకట్ పల్లి సర్కిల్ జీహెచ్ఎంసీ పరిధిలోని బాలానగర్ డివిజన్ వార్డ్ ఆఫీసులో (ప్రభుత్వ కార్యాలయం) టీఆర్ఎస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షురాలు మధులత పుట్టినరోజు వేడుకల సందర్భంగా ప్రభుత్వ కార్యాలయంలో జన్మ దిన వేడుకలు చేసుకోవడం దేనికి సంకేతమని బాలానగర్ మండల సీపీఐ(ఎం) కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మాది రెడ్డి యుగంధర్ రెడ్డి సంబధిత అధికారులను ప్రశ్నించారు. ఇటీవల రాత్రి వేళలో బాలానగర్ వార్డు కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలి జన్మదినం సందర్భంగా వేడుకలు జరుపుకున్న విషయమై వార్డు ఇన్చార్జ్ ను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయమై జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ మమత, ఉప కమిషనర్ రవీందర్ లు స్థానిక కార్పొరేటర్ ప్రజలకు వివరణ ఇవ్వాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో స్థానిక నేతల జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయమై ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆకుల నరేందర్, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.