Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
కూచిపూడి నాట్య శైలిని తన ప్రదర్శనలతో విశ్వవ్యాప్తం చేసిన వెంపటి చిన సత్యం మాస్టారు తెలుగు సంస్కతికి ప్రతీక అని రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ( ఢిల్లీ) డాక్టర్ బస్. వేణుగోపాలాచారి అన్నారు. రవీంద్రభారతిలో మంగళవారం భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో ప్రఖ్యాత నాట్యాచార్యులు డాక్టర్ వెంపటి చిన సత్యం 92 వ జయంతి సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు 12 గంటలు నిర్విరామంగా మాస్టారుకు శిష్య ప్రశిష్యలతో నాట్య నీరాజనాలు అర్పించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమలో వేణుగోపాలాచారి, నాట్య రంగ ప్రముఖులు పసుమర్ధి శేషుబాబు, నీరాజాదేవి, శ్రీనివాస శర్మ, చింతా శివ ఆదినారాయణ, రేణుక, కష్ణ ప్రియ తదితరులు పాల్గొని చిన సత్యం ప్రతిభను కొనియాడారు. నటి జ్యోతి రెడ్డి, మాస్టారు కుమార్తె కామేశ్వరి, సినీ నిర్మాత రామ సత్యనారాయణ ఏబీసీ ఫౌండేషన్ నాట్య సేవను ప్రశంసించారు. వేదికపై దీపికా రాంబాబు, విజయ లక్ష్మి, మహేష్ బాబు, కష్ణ ప్రియ, శివ ఆదినారాయణ, రేణుక,ప్రశాంత్ కుమార్, అశ్వని, పావని సరస్వతీ, నాగ లక్మి తదితరులను అతిథులు నాట్య మంజీర, నాట్యకళా ప్రపూర్ణ, నాట్య సార్వ భౌమ బిరుదులతో సత్కరించారు. సంస్థ నిర్వాహకులు రమణారావు, లలితా రావు, మారుతి వరుణ్ కార్య క్రమాన్ని పర్యవేక్షించారు.