Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయి ఫార్మా సీఎండీ గుడాల కష్ణమూర్తి
నవతెలంగాణ- సుల్తాన్బజార్
ఫార్మా డిస్ట్రిబ్యూషన్ దిగ్గజం భానుమూర్తి బెజుగం ఫార్మా రంగానికి ఒక దిక్సుచి అని సాయి ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ ప్రయివేట్ లిమిటెడ్ సీఎండీ గుడాల కష్ణమూర్తి పేర్కొన్నారు. వాసు గ్రూప్ చైర్మెన్ బెజుగం భానుమూర్తి బయోగ్రఫీని హోటల్ మారియట్లో హోమియోకేర్ ఇంటర్నేషనల్ సీఎండీ డా. శ్రీకాంత్ మోర్లవార్, వాసవి గ్రూప్ డైరెక్టర్ రమేష్ కండే కలిసి భానుమూర్తి బయోగ్రఫీని ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలలో గుడాల కష్ణమూర్తి మాట్లాడుతూ భానుమూర్తి గత 30 ఏండ్లలో ఫార్మా రంగంలో ఎన్నో అధునాతన ప్రక్రియలను ప్రవేశపెట్టి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారన్నారు. దేశంలో ఫార్మా రంగంలో వాసు గ్రూపునకు ప్రత్యేక గుర్తింపు ఉందని ఆయన కొనియాడారు. హోమియోకేర్ ఇంటర్నేషనల్ సీఎండీ డాక్టర్ శ్రీకాంత్ మొర్లవార్ ప్రసంగిస్తూ స్వచ్ఛంద కార్యక్రమాలలో ఎప్పుడూ ముందు ఉండే భానుమూర్తి ఈ లోకంలో లేకపోవడం బాధాకరమని కంటతడి పెట్టారు. ఆయన కోవిడ్ బారిన పడిన తన ఆరోగ్యం పక్కన పడేసి తన సిబ్బంది, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న వద్దని తన సోదరులకు చెప్పారని వివరించారు. తన ప్రాణం కంటే సిబ్బంది, ప్రజల ప్రాణాలు ముఖ్యమన్న దానికి ఇది ఒక నిదర్శనమని తెలిపారు. అనంతరం వాసవి గ్రూప్ డైరెక్టర్ రమేష్ కండే ప్రసంగిస్తూ భాను మూర్తి తన వ్యాపారంతో పాటు స్వచ్ఛంద కార్యక్రమాలు ఎన్నో చేశారని అందులో భాగంగా పేదల పేదలకు వైద్య సహాయం ఎంతో గుప్తంగా చేశారని అన్నారు. ఎన్నో ధార్మిక సంస్థలకు సహాయ సహకారాలు అందించేందుకు ముందు వరుసలో ఉండేవారని అన్నారు. అందులో భాగంగా వర్గల్ లోని శ్రీసరస్వతి దేవి ఆలయ ప్రాంగణంలో కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేపట్టారని తెలిపారు. కోవిడ్ బారిన కేవలం వారం రోజులలోపు భానుమూర్తి, ఆయన తండ్రి వీరేశం కోవిడ్ బారిన పడి మతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ ప్రారంభోత్సవానికి తమ సోదరుడు భాను మూర్తి, తండ్రి వీరేశం ఈలోకంలో లేకపోవడం తమను ఎంతో కలచివేసిందిని వాసు గ్రూప్ సీఈవో బెజుగం శ్రీనివాసు (శ్రీను) మేనేజింగ్ డైరెక్టర్ బెజుగం రమేష్ (రాము) వాపోయారు. కార్యక్రమంలో అరవింద్ బెజుగం, అభినరు బెజుగం, అక్షరు బెజుగం, అనీష్ బెజుగం తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు వీరేశం, భానుమూర్తి పూలతో ఘనంగా నివాళి అర్పించి రెండు నిమిషాలు మౌనం వహించారు.