Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఏపీలో టీడీపీ నాయకులు, పార్టీ కార్యాలయాలపై దాడులను నిరసిస్తూ హైదరాబాద్లో తెలుగు తమ్ముండ్లు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. సికింద్రాబాద్ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు పి.సాయిబాబా అధ్యక్షతన అశోక్నగర్లో జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ.. ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడడం దారుణమన్నారు. దాడులకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రసిడెంట్ నల్లెల్ల కిషోర్, ప్రధాన కార్యదర్శిలు పి.బాలరాజ్గౌడ్, కె.కెమురన్న, రాజుచౌదరి, పెద్దోజు రవీంద్రాచారి, ఎంకె. బోసు, మహిళా అధ్యక్షులు సిహెచ్.విజయశ్రీ, ఎం.రాజు, అద్దంకి ఆనంద్, రాజలింగం, శక్తి ప్రేమ్ తదితరలు పాల్గొన్నారు.