Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్నగర్
ఈనెల 31న ఆన్లైన్లో జరగనున్న ఇండియన్ నేషనల్ మెమోరీ చాంపియన్ షిప్-2021 పోటీల వాల్ పోస్టర్ను రాష్ట్రవిద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా గురువారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మెమోరీ అందరికి అవసరమని, శారీరక వ్యాయామంతో పాటు మేథోశక్తిని మెరుగుపరిచి, జ్ఞాపకశక్తి సాధన చేస్తే అందరూ జీవితంలో విజయాలు సాధించగలుగుతారన్నారు. అనంతరం ఇండియన్ మెమోరీ కౌన్సిల్ అధ్యక్షులు జయసింహ మాట్లాడుతూ మెమోరి చాంపియన్ షిప్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గృహిణులు, చిన్నారులు, పెద్దలు అందరూ పాల్గొనవచ్చునని, ఇండియన్ మెమోరి చాంపియన్ షిప్-2021 టైటిల్తో పాటు పది లక్షల నగదు, ఇతర ప్రోత్సాహకాలు పొందవచ్చునని తెలిపారు. నెంబర్లు, పదాలు, బైనరీ నంబర్లు, చారిత్రక తేదీలు, ప్లెయింగ్ కార్డ్స్ గుర్తు పెట్టుకోవడం అనే ఐదు అంశాలపై మెమోరి పోటీలు ఉంటాయన్నారు. ఈ మెమోరీ చాంపియన్ షిప్ పోటీలో పాల్గొనడం, శిక్షణ కోసం 9985041777, 9985031777 ఫోన్ నెంబర్స్లో సంప్రదించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ సండ్ర, డిజిటల్ కనెక్ట్ సీఈవో నిఖిల్ గుండా తదితరులు పాల్గొన్నారు.