Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
హుజూరాబాద్లో జరుగుతున్న ఉప ఎన్నిక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కాంగ్రెస్కు మధ్య జరుగుతున్న ఉద్యమం అని ఆ పార్టీ మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కో ఆర్డినేటర్ తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. గురువారం హుజూరాబాద్ మండలం విద్యానగర్లో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూర్ వెంకట్ నర్సింగ్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హుజూరాబాద్లో కాంగ్రెస్ గెలుపు తెలంగాణ అభివృద్ధికి మలుపు అని పేర్కొన్నారు. గత ఏడేండ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మహిళ అధ్యక్షురాలు సరితా, ఘట్కేసర్ మండల అధ్యక్షుడు కె. రాజేష్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్ యాదవ్, మేడ్చల్ నియోజకవర్గం బీ బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిశోర్ గౌడ్ పాల్గొన్నారు.