Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. గురువారం స్థానిక ఎస్ఆర్టీ కమ్యూనిటీ హాల్లో అధ్యక్షుడు ఆర్ మోజెస్ ఆధ్వర్యంలో డివిజన్ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యలను గుర్తించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులకు సూచించారు. టీఆర్ఎస్ని ప్రజలకు మరింత చేరువ చేయాలన్నారు. అనంతరం నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాంనగర్ డివిజన్ అధ్యక్షుడు ఆర్ మోజెస్ను అభినందించారు. కార్యక్రమంలో ఎర్రం శేఖర్, ముదిగొండ మురళి, గజ్జల సూర్యనారాయణ, ఇంద్రసేనారెడ్డి, కిషన్ రావు, రాజు చారి, వివేక్, జనార్దన్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.