Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రథమ వర్ధంతి సభను శుక్రవారం ఉదయం పది గంటలకు లోయర్ ట్యాంక్ బండ్లోని పింగళి వెంకట్ రాంరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు నాయిని అల్లుడు, రామ్నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ వి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగా నాయిని నరసింహారెడ్డి ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ ఉంటుందని చెప్పారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, చైర్మెన్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ చైర్మెన్లు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నట్లు తెలిపారు. నాయిని అభిమానులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందరూ హాజరై జయప్రదం చేయాలని శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.