Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
పారిశ్రామిక ప్రగతిలో తెలంగాణ శరవేగంగా దూసుకుపోతుందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాకుండా ప్రపంచ దేశాలతో పోటీ పడేందుకూ తెలంగాణ సిద్ధంగా ఉన్నదన్నారు. రాష్ట్రంలో ఇవాంటి సేవలు ఆమోఘమన్నారు. గురువారం దస్పాల్లా హోటల్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని వాటిని అరికట్టేందుకు ఇవాంటి కృషి చేయడం అభినందనీయమన్నారు. ఐటీ అసెట్స్ (వ్యాపార కార్యకలాపాలలో భాగంగా కంపెనీకి చెందిన ఇన్ఫర్మేషన్, సిస్టమ్ లేదా హార్డ్వేర్)ను క్లౌడ్ కంప్యూటింగ్ నుండి ఎడ్జ్ కంప్యూటింగ్కు నిర్వహించే, భద్రపరిచే, సేవలందించే ఆటోమేషన్ ప్లాట్ఫామ్ అయిన ఇవాంటి రాబోయే రెండు సంవత్సరాలలో ఉద్యోగ నియామకాలను పెంచుకోనున్నట్టు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగరం ప్రముఖ టెక్ కంపెనీలకు గమ్యస్థానంగా ఉందని, ఇవాంటి వాటిలో ఒకటిని తెలిపారు. సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రైవసీ అనేవి ఈ రోజు ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలన్నారు. సాఫ్ట్వేర్ ఎగుమతిదారులలో హైదరాబాద్ ఒకటిగా నిలిచిందన్నారు. అనంతరం ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ మాట్లాడుతూ డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ వేగాన్ని కోవిడ్ మహమ్మారి వేగవంతం చేసి ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలకు సవాళ్లను విసిరిందన్నారు. డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ అనేది సైబర్ ముప్పు ద్వారా స్వీయ సవాళ్లను ఎదుర్కుంటున్నదన్నారు. సురక్షితమైన వ్యాపార వాతావరణాన్ని ఇవాంటి కల్పింస్తోందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీరామ్ బిరుదవోలు, సీఈఓ, సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డాక్టర్ రామ్ మొవ్వ, సైబర్ సెక్యూరిటీ వర్క్స్ చైర్మెన్అండ్ కో-ఫౌండర్, ఇవాంటికి సీనియర్ ఎగ్జిక్యూటివ్లు నాయకి నయ్యర్ ప్రెసిడెంట్, సర్వీస్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ గ్రూప్ అండ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ ముక్కామల తదితరులు పాల్గొన్నారు.