Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
ఎలాంటి విపత్తులు సంభవించిన పోలీసులే ముందుండి ప్రజలను కాపాడుకుంటారని రాఘవేంద్ర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లికార్జున్ అన్నారు. గురువారం పోలీసు అమర వీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బోయిన్పల్లి రాఘవేంద్ర హాస్పిటల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో పోలీసులను ఘనంగా సన్మానించారు. సీఐ రవికుమార్ ముఖ్యఅతిథిగా హాజరై అమరులైన పోలీసులకు నివాళి అర్పించారు. అనంతరం మల్లికార్జున్ మాట్లాడుతూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలను కాపాడుకోవడం పోలీసులు తమ బాధ్యతగా భావిస్తారు అని కొనియాడారు. వారి సేవలు వెలకట్టలేనివన్నారు. కార్యక్రమంలో ఎస్ఐలు సుధాకర్ రెడ్డి, వినరు కుమార్, కనకయ్య, డాక్టర్లు సిద్ధార్థ్, ఫణిభూషణ్, అపర్ణ, అర్జున్ రెడ్డి పాల్గొన్నారు.