Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఈనెల 24న సికింద్రాబాద్ బోయిన్పల్లి జీవీఆర్ గార్డెన్స్లో జరిగే మాదిగ ఉద్యోగులు జాతీయ మహాసభ విజయవంతం చేయాలని మాదిగ ఉద్యోగుల సమాఖ్య నాయకులు, ఓయూ ఎస్సీ, ఎస్టీ నాన్ టీచింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బోయ కుమార్, సీనియర్ నాయకులు శంకరయ్య కోరారు. ఈమేరకు గురువారం ఓయూ పరిపాలన భవన్ ఎదుట కరపత్రం విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మందకష్ణ మాదిగ ఆధ్వర్యంలో 27 ఏండ్లుగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం జరుగుతుందని, సమాజంలో ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంతా అనే న్యాయమైన డిమాండ్తో ఎస్సీలందరికీ అన్ని రంగాలలో సమన్యాయం జరగాలని ఉద్యమిస్తున్నారని చెప్పారు. అందులో భాగంగానే మాదిగ ఉద్యోగులందరూ తమ వంతు పాత్ర పోషిస్తూ ఈనెల 24న జరగబోయే మాదిగ ఉద్యోగుల ఐదవ జాతీయ మహాసభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ ఓయూ ఇన్చార్జి పల్లెర్ల సుధాకర్ మాదిగ, నాయకులు నరేష్, వరలక్ష్మి, సుహాసిని, రాజేశ్వరరావు యశ్వంత్, వినోద్, శ్రీనివాస్, ప్రమీల అనురాధ, కిరణ్ కుమార్, యామిని తదితరులు పాల్గొన్నారు.