Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
నవతెలంగాణ-అడిక్మెట్
మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సేవలు చిరస్మరణీయమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. అడిక్మెట్ టీఆర్ఎస్ అధ్యక్షులు బల్ల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం విద్యానగర్లోని ఎస్ఆర్టీ కమ్యూనిటీ హాల్లో నాయిని వర్ధంతి సభ నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై నాయిని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలంగాణ పోరాటంలో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వర్ధంతి సభలో కార్యదర్శి సురేందర్, రవి యాదవ్, ఆకారం శ్రీనివాస్, ఖాదిర్, ప్రేమ్, కిషోర్, గురుదీప్, సత్యనారాయణ, నాగులు, టైలర్ శ్రీను, విక్కీ, నందు, ప్రవీణ్ పాల్గొన్నారు.