Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
దుండిగల్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం డేటా సైన్స్ అపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సెమినార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగీకులుగా వై. శివతేజ జూనియర్ ఇంజినీర్ ఎక్స్ ట్రీమ్ కంప్యూటర్ ఇన్ కార్పొరేషన్ హైదరాబాద్ వారు పాల్గొని డేటా సైన్స్ టూల్స్పై విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో సంక్షిప్తంగా వివరించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్వీ నరసింహ ప్రసాద్, డేటా సైన్స్ హెచ్ఓడీ డాక్టర్ పి. గోవర్ధన్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల్లో కళాశాలలో నిర్వహించడం వల్ల కంపెనీలో జరుగుతున్న పలు నూతన విషయాలపై, ప్రాజెక్టులపై విద్యార్థులకు అవగాహన పెంపొందుతుందని తెలిపారు. విద్యార్థులకు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించేందుకు ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కళాశాలలో సెమినార్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమం కన్వీనర్గా డా . ఎం. లక్ష్మీ ప్రసాద్, కోఆర్డినేటర్లుగా డి. శ్రీనివాసులు, పీఎల్వీ నరసింహారావు, వైష్ణవి వ్యవహరించారు.