Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
జీవితమంతా దళిత, బహుజనుల బాగుకోసం పలు పథకాల రచన చేసిన ఎస్ ఆర్ శంకరన్ జీవితం నేటి అధికారులకు మార్గదర్శనం కావాలని వాణిజ్య పన్నుల శాఖ విశ్రాంత అధికారి వై.సత్యనారాయణ అన్నారు. శుక్రవారం శంకరన్ 87వ జయంతిని ఎమ్బీ భవన్ వద్ద ఉన్న ఎస్.ఆర్.శంకరన్ ఐఏఎస్ అకాడమీలో నిర్వహించారు. సత్యనారాయణ కీలకోపన్యాసం చేస్తూ సివిల్ సర్వీస్ అధికారిగా చట్టానికి మానవతా విలువలు మేళవించిన శంకరన్ గొప్ప క్రాంతిదర్శి అన్నారు. దళితులపై వివక్షతకు వ్యతిరేకంగానే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్ట రూపకర్త ఆయన అని, సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల ఆరంభించి పేదలకు విద్యను చేరువ చేశారని వివరించారు. ఆయన జీవిత చరిత్రను నేటి యువత తెలుసుకొని స్ఫూర్తి పొందాలన్నారు. అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్న సమావేశానికి అకాడమీ పాలనాధి కారి నరేష్ కుమార్ స్వాగతం పలికారు.