Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
కొమురం భీం 120వ జయంతిని హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ మంగు నాయక్ అధ్యక్షతన శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి హాజరై మాట్లాడుతూ ఆదివాసీ విద్యార్థులు కొమురం భీం స్ఫూర్తితో ఉన్నత విద్యలో రాణించాలని సూచించారు. విద్యతోనే ఎదుగుదల, సంస్కృతిని సంరక్షించుకునే అవకాశం ఉందని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొ.నాగేశ్వర్ మాట్లాడుతూ ఆదివాసీ హక్కులు కాగితాలకే పరిమితమయ్యాయి తప్ప అమలు చేయడం లేదన్నారు. ఓయూ వీసీ ప్రొ.డి. రవీందర్ మాట్లాడుతూ గోండు భాషాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం ఆధ్వర్యంలో ఓయూలో ఆదివాసీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని, ఆదివాసీ విద్యార్థులను ప్రోత్సహించాలని కోరారు. ప్రొఫెసర్ మంగు నాయక్ మాట్లాడుతూ. కొమురం భీం 120వ జయంతిని ఉస్మానియా యూనివర్సిటీలో మొట్టమొదటిసారిగా అధికారికంగా నిర్వహిస్తున్నామని,ఆయన స్ఫూర్తిని రాబోయే తరాలకు పుస్తకాల రూపంలో అందిస్తామని పేర్కొన్నారు. అనంతరం ఆదివాసీ మిషన్ 1000 పోస్టర్ను ఆవిష్కరించారు. అంతకుముందు ఓయూ ఎన్సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కళాశాల మీదుగా ఠాగూర్ ఆడిటోరియం వరకు ఆదివాసీలు సంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో యూజీసీ డీన్ ప్రొ.మల్లేషం, అధ్యాపకులు, ప్రిన్సిపాల్ డా.అనురాధ, ఆప్కా నాగేశ్వరరావు, డా.కిషోర్ కుమార్, డా.వెంకట్ రమణ, పాపయ్య, భట్టు వెంకటేశ్వర్లు, అరుణ్, సందీప్, వెంకన్న, లక్ష్మణ్, సుధీర్, మాలబాబు నవీన్ పాల్గొన్నారు.