Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ రీజియన్ వర్క్షాప్లో జూబ్లీహిల్స్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే
నవతెలంగాణ-సిటీబ్యూరో
నవతెలంగాణ ప్రజల సమస్యలు, ప్రజలపక్షాన నిలబడే పత్రికని జూబ్లీహిల్స్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. శుక్రవారం నవతెలంగాణ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ రీజియన్ వర్క్షాప్లో నవీన్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పూర్వం పత్రికలంటే ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండేవారని, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చేవారన్నారు. అయితే నేటి రోజుల్లో పత్రికలకు ఎవరి ఎజెండా వారికుందన్నారు. నవతెలంగాణ పత్రికకు మాత్రం ప్రజల సమస్యలే ముఖ్యమని, ప్రజల గొంతుకగా నిలిచిందన్నారు. సమాజంలో గెలుపు ఓటములు సహజమని, ప్రజల పక్షాన నిలబడి వారి సమ్యలు తీర్చేవారే ముఖ్యమని తెలిపారు. సీనియర్ రాజకీయ నాయకుడు తన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ చూపిన బాటలో నడుస్తున్నానని తెలిపారు. ఆర్కిటెక్ చదవిన తాను ఎంతో మంది చదువుకోవాలనుకున్న యువతీయువకులకు అండగా నిలుస్తున్నట్టు పేర్కొన్నారు. కులాలకు అతీతంగా మెరిట్ విద్యార్థుల ఉన్నత చదువులకు సహాయసహకారాలను అందిస్తున్నట్లు చెప్పారు. 2008లో డీఎస్సీ చదువుతున్న వందలాది మంది అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇప్పించానని, అందులో 40 మందికిపైగా టీచర్లుగా ఎంపికయ్యారన్నారు. తాను సహాయం చేసిన వారిలో డాక్టర్లు, టీచర్లు, కానిస్టేబుళ్లుతోపాటు ఇద్దరు జూనియర్ న్యాయమూర్తులుగా ఎంపికయ్యారని గుర్తు చేశారు. నగరంలో వందలాది మంది కార్మికులున్నారని అయితే వారికి వారి హక్కులపై పూర్తిగా అవగాహన లేదన్నారు. వచ్చే ఏడాదిలో కొంత మంది కార్మికులకు బీమా సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పేద జర్నలిస్టులకు సైతం తన వంతుగా సహాయసహకారాలను అందిస్తానని హామీనిచ్చారు. నవీన్ యాదవ్ చేస్తున్న సేవలు అభినందనీయమని పత్రికా ఎడిటర్ సుధా భాస్కర్, జనరల్ మేనేజర్ లింగారెడ్డి, మఫీషియల్ ఇన్ఛార్జ్ వేణు మాధవరావు, హైదరాబాద్ మేనేజర్ వాసు అన్నారు. వర్క్షాప్లో పాల్గొన్నవారికి భోజనం సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్ను ఘనంగా సన్మానించారు.