Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవతెలంగాణ హైదరాబాద్ రీజియన్ వర్క్షాప్లో అభినయ శ్రీనివాస్
విలేకరులకు సరుకుల పంపిణీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రతి మనిషి ఎంతో కొంత ఎదుటివారికి సహాయపడాలనే లక్ష్యంతో తన వంతుగా ప్రజా సేవ చేస్తున్నానని, అది తనకు ఎంతో సంతృప్తినిస్తుందని అభినయ థియేటర్ ట్రస్టు చైర్మెన్ గద్దె అభినయ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం నవతెలంగాణ హెడ్ ఆఫీసులో జరిగిన హైదరాబాద్ రీజియన్ విలేకరుల వర్క్షాప్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కాలం నుంచి తమ ట్రస్టు ఆధ్వర్యంలో ఇప్పటివరకు నగరంలోని పేదలకు, కళాకారులకు, బస్తీ వాసులకు సుమారు రూ.55 లక్షల విలువైన నిత్యావసర సరుకులు అందించామన్నారు. అలాగే నవతెలంగాణ పత్రికకు చెందిన 250 మంది జర్నలిస్టులకు, సిబ్బందికి సరుకులు పంపిణీ చేశారు. భవిష్యత్తులో నవతెలంగాణ పత్రికకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఈ సందర్భంగా నవతెలంగాణ దినపత్రిక సంపాదకులు సుధా భాస్కర్.. అభినయ శ్రీనివాస్ చేస్తున్న సేవలకుగాను అభినందించి శాలువాతో సత్కారించారు. అభినయ ట్రస్టు సభ్యుడు సుబ్బారావును మఫీషియల్ ఇన్చార్జి వేణు మాధవరావు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో నవతెలంగాణ జనరల్ మేనేజర్లు లింగారెడ్డి, వాసు పాల్గొన్నారు.