Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఏపీలో టీడీపీ నాయకులు, కార్యాలయాలపై దాడులకు నిరసనగా నగరంలో టీడీపీ నాయకులు 'మౌన దీక్ష' నిర్వహించారు. సికింద్రాబాద్ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు పి.సాయిబాబా ఆధ్వర్యంలో టీడీపీ జిల్లాపార్టీ కార్యాలయంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే ప్రజా భవనాన్ని కూల్చడం ఆరంభమైందని ఆరోపించారు. వైసీపీ పాలన పాలనకు పరాకాష్టగా నిలిందన్నారు. వైసీపీ మంత్రులు చంద్రబాబుపై దుర్బాషలాడుతూ సమాజంలో విద్వేశాలు రెచ్చగొడుతున్నారని తెలిపారు. ఏపీలో టీడీపీ నాయకులు, కార్యాలయాలపై దాడులు చేడం దారుణమన్నారు. పోలీసులు అధికారపార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నాయకులపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రసిడెంట్ నల్లెల్ల కిషోర్, ప్రధాన కార్యదర్శులు పి.బాలరాజ్గౌడ్, కొమురన్న, రాజాచౌదరి, ఇన్ చార్జీలు బిల్డర్ ప్రవీణ్, సీహెచ్.విజయశ్రీ, ప్రమీల, అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.