Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూ ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఆర్ట్స్ కళాశాల ఎదుట కొమురం భీమ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు గణేష్, రవి నాయక్ మాట్లాడుతూ గిరిజనుల హక్కుల కోసం విప్లవ పంథాలో పోరాడిన కొమురం భీమ్ ను స్ఫూర్తిగా తీసుకుని యువతరం గిరిజన విద్యార్థుల హక్కులు, చదువు, ఉద్యోగ అవకాశాల కోసం పోరాటం చేయాలని సూచించారు. ప్రభుత్వం కొమురం భీమ్ చరిత్ర పట్ల చూపుతున్న నిరాదరణను వీడి కొమురం భీమ్ గురించి రేపటి తరం తెలుసుకుని ప్రభావ వంతం అయ్యేలా చరిత్ర ను అందివ్వాలని, గిరిజన విద్యార్థుల కోసం ట్రైబల్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు విజయ నాయక్, నరేష్, అఖిల్, లక్ష్మణ్, లింగన్న, సుమన్, శ్రావణ్, శివ, ఫయాజ్, కుమార్, వెంకటేష్ పాల్గొన్నారు.